బరితెగించిన పాక్‌ రేంజర్స్‌

10 Nov, 2023 06:21 IST|Sakshi

సరిహద్దు వెంట కాల్పుల్లో కానిస్టేబుల్‌ వీరమరణం

జమ్మూ/అరి్నయా: కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుస్తూ పాకిస్తాన్‌ రేంజర్స్‌ జరిపిన కాల్పుల్లో సరిహద్దు భద్రతా దళం(బీఎస్‌ఎఫ్‌) హెడ్‌ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయారు. జమ్మూకశ్మీర్‌లోని సాంబా జిల్లాలోని రామ్‌గఢ్‌ సెక్టార్‌లో భారత్‌–పాక్‌ సరిహద్దు వెంట గురువారం ఈ ఘటన జరిగింది.

సరిహద్దు ఔట్‌పోస్ట్‌ వద్ద ఉన్న 50ఏళ్ల లాల్‌ఫామ్‌ కీమాపై కాల్పులు జరపడంతో రక్తమోడుతున్న ఆయనను వెంటనే స్థానిక ఆస్పత్రికి, మెరుగైన చికిత్స కోసం జమ్మూలోని జీఎంసీ ఆస్పత్రికి తరలించినా ప్రాణాలు దక్కలేదని ఆర్మీ అధికారులు వెల్లడించారు. ‘ పాక్‌ రేంజర్ల కాల్పులకు దీటుగా బీఎస్‌ఎఫ్‌ బలగాలు కాల్పుల మోత మోగించాయి. సమీపంలోని జెర్దా గ్రామంపైనా పాక్‌ రేంజర్లు కాల్పులు జరిపారు’ అని ఆర్మీ ఒక ప్రకటనలో పేర్కొంది.   

మరిన్ని వార్తలు