‘టైగర్’ దర్శకునితో సినిమా

23 Oct, 2015 23:34 IST|Sakshi
‘టైగర్’ దర్శకునితో సినిమా

వైవిధ్యమైన చిత్రాలకు సరికొత్త చిరునామా... నిఖిల్. తాజాగా ఆయన మరో విభిన్న చిత్రానికి పచ్చజెండా ఊపారు. సందీప్ కిషన్ హీరోగా ై‘టెగర్’ చేసిన వి.ఐ. ఆనంద్‌తో ఆయన సినిమా చేయనున్నారు. మేఘన ఆర్ట్స్ పతాకంపై పి.వెంకటేశ్వరరావు నిర్మించనున్న ఈ చిత్రం గురువారం హైదరాబాద్‌లో మొదలైంది. నిర్మాత మాట్లాడుతూ -‘‘ఈ చిత్రాన్ని నిఖిల్ సింగిల్ సిట్టింగ్‌లోనే ఓకే చేశారు. త్వరలోనే టైటిల్ ప్రకటిస్తాం. నవంబర్‌లో షూటింగ్ మొదలుపెడతాం’’ అని చెప్పారు. ఈ చిత్రానికి మాటలు: అబ్బూరి రవి, సంగీతం: శేఖర్‌చంద్ర, సహనిర్మాత: డి. శ్రీనివాస్.