తమిళసినిమా: సంగీతానికి భాష లేనట్టుగానే కళాకారులకు జాతి భేదం ఉండదు. కాగా మనకు దాయాదుల దేశం అయిన పాకిస్థాన్కు చెందిన ప్రముఖ గాయకుడు కోలీవుడ్కు పరిచయం అయ్యారు. నటుడు నకుల్ హీరోగా నటిస్తున్న సెయ్ చిత్రానికిగానూ పాకిస్థాన్ గాయకుడు అటీఫ్ అలీ తొలిసారిగా ఒక పాట పాడడం విశేషం. పలు పాకిస్థానీ చిత్రాలకు పాటలు పాడిన అటీఫ్అలీ కొన్ని హిందీ చిత్రాలకు పాడారు. ఆయన త్వరలో విడుదలకు సిద్ధం అవుతున్న నటి రాయ్లక్ష్మీ నటించిన జూలీ–2 చిత్రానికి సంగీతం అందించారన్నది గమనార్హం. నిక్స్ సంగీతం అందించిన ఇరైవా అనే యుగభారతీ రాసిన పాటను అటీఫ్ అలీతో కలిసి సప్తస్వర రిషు పాడారు.
ఇది ఒక సూఫీ పాటగా ఉంటుందట. కోలీవుడ్కు గాయకుడిగా పరిచయం అవడం సంతోషంగా ఉందని ఈ సందర్భంగా పాకిస్థాన్ గాయకుడు అటీఫ్ అలీ పేర్కొన్నారు. ఈ పాట పదికాలాల పాటు గుర్తుండిపోతుందనే ఆనందాన్ని చిత్ర నిర్మాతలు వ్యక్తం చేశారు. ఇందులో ప్రముఖ గాయనీగాయకులు శంకర్మహాదేవన్, సోనూనిగమ్, శ్రేయాగోషల్, పిన్నిదయాళ్ నవగాయనీ గీతాంజలి పాడారని నిర్మాతలు తెలిపారు. టిప్పీటర్పిల్ ప్రొడక్షన్ పతాకంపై మను, ఉమేష్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. డిసెంబర్ 8న సెయ్ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు సన్నాహాలు చేస్తున్నామని వారు వెల్లడించారు.