‘సరోవరం’ 100 డేస్‌ ఆడాలి

5 Nov, 2017 01:10 IST|Sakshi

విశాల్, ప్రియాంకా శర్మ జంటగా శ్రీలత క్రియేషన్స్‌ పతాకంపై నూతన దర్శకుడు సురేశ్‌ యాదవల్లి రూపొందించిన చిత్రం ‘సరోవరం’. ఈ చిత్రంతో ఎస్‌. శ్రీలత నిర్మాతగా పరిచయం అవుతున్నారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ హోం మినిస్టర్‌ నాయిని నరసింహారెడ్డి పాటల సీడీలను విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ– ‘‘పాటలు చాలా బాగున్నాయి. ఈ సినిమా 100డేస్‌ ఆడాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.

‘‘అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌. జబర్దస్త్‌ టీమ్‌ ఈ సినిమాలో మంచి కామెడీ చేశారు’’ అన్నారు విశాల్‌. ‘‘యూనిట్‌ని ప్రోత్సహించడానికి వచ్చిన అందరికీ థ్యాంక్స్‌. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్‌’’ అన్నారు ప్రియాంకా శర్మ. చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య, నిర్మాత శ్రీలత తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సినిమాకి బెక్కం రవీంద్ర లైన్‌ ప్రొడ్యూసర్‌.

మరిన్ని వార్తలు