బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటూ ముగ్గురు గల్లంతు

24 Jul, 2017 01:42 IST|Sakshi
బీచ్‌లో సెల్ఫీ తీసుకుంటూ ముగ్గురు గల్లంతు

డామన్‌: కేంద్ర పాలిత ప్రాంతం డామన్‌ డయ్యూలోని నగవ్‌ బీచ్‌లో సెల్ఫీలు తీసుకుంటుండగా పెద్ద అల వచ్చి ముగ్గురు కొట్టుకుపోయారు. రాజస్తాన్‌కు చెందిన ఐదుగురు వ్యక్తులు డయ్యూ దగ్గర్లో భవన నిర్మాణ పనిలో చేరారు.

ఆదివారం  బీచ్‌లో నలుగురు ఓ రాయిపై కూర్చొని సెల్ఫీ తీసుకుంటుం డగా, మరొకరు కాస్త దూరం నుంచి వారిని వీడియో తీస్తున్నారు. అదే సమయంలో రాకాసి అల వచ్చి రాయిపై కూర్చున్న నలుగురిని సముద్రంలోకి లాక్కుపోయింది. కొద్ది సేపటి తర్వాత ఒకరు ఈదుకుంటూ ఒడ్డుకు రాగలిగారు. మరో ముగ్గురి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు