మంచు చరియలు పడి ఐదుగురు మృతి

19 Jan, 2019 04:12 IST|Sakshi

శ్రీనగర్‌: కశ్మీర్‌లోని లడఖ్‌ పరిధిలోని ఖర్దంగ్‌లో శుక్రవారం మంచు చరియలు విరిగిపడి ఐదుగురు మృతి చెందగా మరో ఐదుగురు గల్లంతయ్యారు. ఉదయం ఏడు గంటల ప్రాంతంలో 10 మందితో ప్రయాణిస్తున్న ఓ ట్రక్కు ఖర్దంగ్‌లాకు చేరుకుంది. అదే సమయంలో ఆ ట్రక్కుమీదుగా ఒక్కసారిగా మంచుతో కూడుకున్న కొండచరియలు విరిగిపడటంతో ట్రక్కులో ప్రయాణిస్తున్న ఐదుగురూ మరణించారు. మరో ఐదుగురి జాడ తెలియలేదు. శిథిలాల్లో కూరుకుపోయిన మృతదేహాలను వెలికి తీశారు. కనిపించకుండా పోయిన వారి కోసం సహాయక చర్యలు చేపట్టినట్లు బోర్డర్‌ రోడ్ల ఆర్గనైజేషన్‌ అధికారులు మీడియాకు వెల్లడించారు.

మరిన్ని వార్తలు