తమిళనాడులో కరోనా విజృంభణ.. 765 పాజిటివ్‌

24 May, 2020 20:34 IST|Sakshi

సాక్షి, చెన్నై: తమిళనాడులో కరోనా వైరస్‌ విజృంభిస్తోంది. గత 24 గంటల్లో కొత్తగా 765 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన నివేదికలో ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. గత 24 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా నమోదైన 765 కేసుల్లో 587 కేసులు రాజధాని చెన్నైలోనే నమోదయినట్లు నివేదికలో వెల్లడించింది. తమిళనాడులో కరోనా బారినపడిన వారి సంఖ్య మొత్తం 16,277కు చేరుకుంది. చెన్నైలో ఇప్పటివరకు మొత్తం 10,567 పాజిటివ్‌ కేసులు నమోదయినట్లు ప్రభుత్వం పేర్కొంది. తమిళనాడులో ఇప్పటివరకు కరోనా బారినపడి 111 మంది మరణించారు.

మరిన్ని వార్తలు