టోల్‌ప్లాజా వద్ద కారు బీభత్సం..

14 May, 2017 09:49 IST|Sakshi
టోల్‌ప్లాజా వద్ద కారు బీభత్సం..

ఖేదా: టోల్‌ప్లాజా వద్ద ఓ కారు బీభత్సం సృష్టించింది. తొందరగా వెళ్లాలని బావించిన కారు డ్రైవర్ ప్లాజా సమీపానికి రాగానే ముందు వెళ్తున్న కారును ఢీకొట్టాడు. దీంతో ఆ కారు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ఘటన గుజరాత్ లోని ఖేదాలో శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణాలకు ముప్పులేదని వైద్యులు తెలిపారు.

వాస్తవానికి టోల్‌ప్లాజాల వద్ద ఒక లేన్‌లో ఒక వాహనానికి మాత్రమో చోటుంటుంది. అయితే ప్లాజా వద్ద ఉద్యోగికి జిప్సీ డ్రైవర్ మనీ ఇచ్చి స్లిప్ తీసుకున్నాడు. గేట్ తీయగానే జిప్సీ కదులుతుండా వెనక నుంచి పెద్ద శబ్దం వచ్చింది. ఓ కారు ముందు ఉన్న మరో వాహనాన్ని వేగంగా ఢీకొట్టడంతో వెంటనే పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఢీకొట్టిన కారు పాక్షికంగా ధ్వంసమైంది. ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

మరిన్ని వార్తలు