సాక్షి, చెన్నై : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సమాధి వద్ద ఆదివారం ఉదయం కలకలం రేగింది. పోలీస్ కానిస్టేబుల్ ఒకరు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మధురైకు చెందిన ఎమ్ అరుణరాజ్ అనే కానిస్టేబుల్ మెరీనా బీచ్లోని జయలలిత మెమోరియల్ వద్ద తన సర్వీస్ రైఫిల్తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఘటనా స్థలంలోనే అతను చనిపోయినట్లు తెలుస్తోంది. మృత దేహాన్ని దగ్గర్లోని రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
అతని ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉందని ఉన్నతాధికారులు తెలిపారు. వ్యక్తిగత కారణాలే అయి ఉండొచ్చన్న అనుమానిస్తున్నారు.
కానిస్టేబుల్ అరుణ్ ఫైల్ ఫోటో