ప్రధాని ర్యాలీకి వెళ్లొస్తున్న వారిపై రాళ్ల దాడి

30 Dec, 2018 03:46 IST|Sakshi

కానిస్టేబుల్‌ దుర్మరణం

లక్నో: ప్రధాని మోదీ సభకు హాజరైన ప్రజలపై ఆందోళనకారులు చేసిన దాడిలో ఓ పోలీస్‌ కానిస్టేబుల్‌ ప్రాణాలు కోల్పోయాడు. ఘాజీపూర్‌లో మోదీ సభకు వెళ్లివస్తున్న ప్రజలపై రాష్ట్రీయ నిషాద్‌ పార్టీకి చెందిన కార్యకర్తలు రాళ్ల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా తలపై ఓ రాయి బలంగా తలగడంతో కానిస్టేబుల్‌ సురేశ్‌ వత్స్‌(48) తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ మృతిచెందారు. ఈ విషయమై ఘాజీపూర్‌ సూపరింటెండెంట్‌ యశ్వీర్‌ సింగ్‌ మాట్లాడుతూ.. నిషాద్‌ పార్టీ మద్దతుదారుల్ని అధికారులు ప్రధాని సభకు వెళ్లకుండా అడ్డుకున్నారని తెలిపారు. దీంతో సభనుంచి తిరిగివస్తున్న వాహనాలను వీరు అడ్డుకుని రాళ్లదాడి చేశారన్నారు. ఈ ఘటనకు సంబంధించి 15 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. మరోవైపు సురేశ్‌ భార్యకు రూ.40 లక్షలు, తల్లిదండ్రులకు రూ.10 లక్షల నష్టపరిహారాన్ని యూపీ సీఎం ఆదిత్యనాథ్‌ ప్రకటించారు. 

మరిన్ని వార్తలు