శాతానికి పెరిగిన డీఏ

8 Mar, 2018 02:14 IST|Sakshi

7 శాతానికి పెరిగిన డీఏ

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు ప్రయోజనం  

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కరువు భత్యం (డీఏ), కరువు సాయం (డీఆర్‌)ను 2 శాతం పెంచుతూ మంత్రివర్గం బుధవారం నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం 5 శాతం ఉన్న డీఏ, డీఆర్‌లను 7 శాతానికి పెంచి ఈ ఏడాది జనవరి నుంచే ఆ ప్రయోజనాన్ని వర్తింపజేయాలని నిర్ణయించింది. దీంతో 1.1 కోట్లమంది కేంద్ర ఉద్యోగులు, పింఛనుదారులకు లబ్ధి కలగనుంది.‘ధరల పెరుగుదలను తట్టుకునేందుకు డీఏ, డీఆర్‌లను మూలవేతనం/పింఛనుపై 7 శాతానికి పెంచాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినెట్‌ నిర్ణయించింది’ అని ప్రభుత్వం తెలిపింది. దీంతో ఖజానాపై ఏడాదికి రూ.6,077 కోట్ల అధిక భారం పడనుంది.

► సులభతర వాణిజ్య నిర్వహణ ర్యాంకింగ్స్‌లో స్థానాన్ని మెరుగుపరచు కునే లక్ష్యంతో రెండు చట్టాలను సవరించేందుకు కేబినెట్‌ ఆమోదం. వాణిజ్య వివాదాలు త్వరగా పరిష్కారమయ్యేందుకు ఈ సవరణలు దోహ దపడతాయి.
► స్వాతంత్య్ర సమరయోధుల పింఛను పథకం ‘స్వతంత్రత సైనిక్‌ సమ్మాన్‌ యోజన’ను 2020 వరకు కొనసాగించేందుకు  ఆమోదం.

మరిన్ని వార్తలు