బెంగళూరులో మహిళకు భయానక అనుభవం

14 Oct, 2017 17:35 IST|Sakshi

బెంగళూరు : విపరీతంగా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లపైనే పోటెత్తుతున్న వరదలు బెంగళూరు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇప్పటికే శుక్రవారం నాటి వర్షం కారణంగా ఐదుగురు ప్రాణాలుకోల్పోగా పలువురు దాని ప్రభావాన్ని స్వయంగా ఎదర్కొంటున్నారు. ముఖ్యంగా ఓ మహిళ దాదాపు చావు అంచుల్లోకి వెళ్లి తిరిగొచ్చింది. ఎక్కడ మ్యాన్‌ హోల్స్‌ ఉన్నాయో కూడా తెలియని పరిస్థితుల్లో కూడా పరిమళించిన మానవత్వం ఆమె ప్రాణాలు నిలబెట్టింది. వరదల్లో ఆమె కారు కొట్టుకుపోతుండగా ధైర్యంగా కొంతమంది వ్యక్తులు తెగించి ఆమెను కారులో నుంచి బయటకు తీసి రక్షించారు.

ఇప్పుడు ఈ వీడియో సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతోంది. పోలీసుల వివరాల ప్రకారం బెంగళూరులోని నయందహళ్లి అనే చౌరస్తాలో అనుకోకుండా ఓ మహిళ రోడ్డుపై నిలిచిన వరదలో చిక్కుపోయింది. కారును సైతం ఆ వరద నీరు నెట్టేస్తుంది. ఆమె ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్లలేదు.. అలాగని వెనక్కి రాలేదు. దీంతో బిక్కుబిక్కుమంటూ కార్లోనే రోధిస్తుండగా అది చూసిన కొంతమంది వ్యక్తులు, ట్రాఫిక్‌ పోలీసులు తాడుసాయంతో తమ ప్రాణాలకు తెగించి ఆమెను రక్షించారు.

మరిన్ని వార్తలు