పాన్‌- ఆధార్‌ లింక్‌ గడుపు పెంపు

6 Jul, 2020 19:00 IST|Sakshi

న్యూఢిల్లీ : పాన్‌- ఆధార్‌ కార్డ్‌ లింక్‌ గడువును పొడగిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.  ఇప్పటికే చాలా సార్లు దీని గడువును పొడిగించిన కేంద్రం.. తాజాగా సోమవారం మరోసారి పొడగించింది. రేపటితో (మంగళవారం) గడువు ముగుస్తుండగా.. వచ్చే ఏడాది (2021) మార్చి 31 వరకు పొడిగించింది. దేశంలో కరోనా వైరస్‌ దృష్ట్యా ఆదాయపు పన్నుశాఖ నిర్ణయం తీసుకుంది. కాగా పాన్ కార్డు‌ కలిగిన ప్రతి ఒక్కరూ ఆధార్ కార్డుతో కచ్చితంగా అనుసంధానం చేసుకోవాల్సిందే. దీనిని ఈ ఏడాది ఏప్రిల్‌లో కేంద్రం తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. లేకుంటే పాన్‌ కార్డు చెల్లదని ఐటీశాఖ ప్రకటించింది. 

మరిన్ని వార్తలు