రైలు బీమా షురూ

2 Sep, 2016 12:25 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రం రైలు ప్రయాణికులకు ఐచ్ఛిక ప్రమాద బీమా సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. ఐఆర్‌సీటీసీ ద్వారా టికెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు మాత్రమే ఈ అవకాశం కల్పించింది. కొత్త పథకాన్ని కేంద్ర రైల్వే మంత్రి సురేశ్ ప్రభు గురువారమిక్కడ ప్రారంభించారు.

టికెట్ బుకింగ్ సమయంలో బీమా సదుపాయం ఎంపిక చేసుకోవడం ప్రయాణికుడి ఇష్టం. ఏడాదిపాటు పెలైట్ ప్రాజెక్టుగా ఈ పథకాన్ని అమలు చేయనున్నారు. ప్రీమియంగా రూ.92పైసలు మాత్రమే వసూలుచేస్తారు. రైలు ప్రమాదాల్లో ప్రయాణికుడు మరణిస్తే రూ. 10 లక్షల ప్రమాద బీమా అందిస్తారు.

>
మరిన్ని వార్తలు