న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలకు కలిపి ఒకే సచివాలయాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు చేస్తోంది. సెంట్రల్ ఢిల్లీలోని లోథీ రోడ్ లో రూ. 20 వేల కోట్లతో సచివాలయాన్ని నిర్మించేందుకు ప్రభుత్వం ఆలోచిస్తోందని, ఇందుకోసం ఆ ప్రాంతంలో నివాసముండే 4 వేల కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను కూల్చాల్సి ఉందని ఒక పత్రిక కథనాన్ని వెలువరించింది.
రానున్న ఐదేళ్లలో సచివాలయాన్ని నిర్మించాలని భావిస్తున్నట్టు తెలిసింది . అయితే దీనికి ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించాల్సి ఉంది. ప్రస్తుతం నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, కృషి భవన్, నిర్మణ్ భవన్, శాస్త్రి భవన్లలో ఉన్న మంత్రుల భవనాలు ఉన్నాయి.