రూ.20 వేల కోట్లతో కామన్ సెక్రటేరియట్

2 Jun, 2016 21:55 IST|Sakshi
న్యూఢిల్లీ:  కేంద్ర ప్రభుత్వం అన్ని మంత్రిత్వ శాఖలకు కలిపి ఒకే సచివాలయాన్ని నిర్మించేందుకు ప్రయత్నాలు  చేస్తోంది. సెంట్రల్ ఢిల్లీలోని లోథీ రోడ్ లో  రూ. 20 వేల కోట్లతో సచివాలయాన్ని నిర్మించేందుకు  ప్రభుత్వం ఆలోచిస్తోందని,  ఇందుకోసం ఆ ప్రాంతంలో నివాసముండే 4 వేల కుటుంబాలకు సంబంధించిన ఇళ్లను కూల్చాల్సి ఉందని ఒక పత్రిక కథనాన్ని వెలువరించింది.

రానున్న ఐదేళ్లలో సచివాలయాన్ని నిర్మించాలని భావిస్తున్నట్టు తెలిసింది . అయితే దీనికి ప్రధాని నరేంద్ర మోదీ ఆమోదించాల్సి ఉంది. ప్రస్తుతం  నార్త్   బ్లాక్, సౌత్ బ్లాక్, కృషి భవన్, నిర్మణ్ భవన్, శాస్త్రి భవన్లలో ఉన్న మంత్రుల భవనాలు ఉన్నాయి.
 
మరిన్ని వార్తలు