పురందేశ్వరిని కలిసిన ఏపీ ఉద్యోగులు | Sakshi
Sakshi News home page

పురందేశ్వరిని కలిసిన ఏపీ ఉద్యోగులు

Published Thu, Jun 2 2016 6:35 PM

ap employees meet bjp leader purandeswari

హైదరాబాద్ : ఏపీ ప్రభుత్వం ప్రణాళిక బద్ధంగా వెళితే ఉద్యోగుల సమస్యలు పరిష్కారమయ్యేవని బీజేపీ నేత, కేంద్ర మాజీ మంత్రి పురందేశ్వరి తెలిపారు. గురువారం ఏపీ ఉద్యోగులు పురందేశ్వరిని కలిశారు.తాత్కాలిక రాజధానికి తరలించవద్దని ఈ సందర్భంగా ఉద్యోగులు ఆమెను కోరారు. తమ సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యోగులతో భేటీ అనంతరం పురందేశ్వరి మాట్లాడుతూ పిల్లల భవిష్యత్ గురించి ఉద్యోగులు ఆవేదన పడుతున్నారన్నారు. ఏపీ అగ్రగామిగా ఉండాలంటే ఉద్యోగులు  కలిసి పనిచేయాలన్నారు.

Advertisement
Advertisement