వెదురు బొంగులు, ఇనుపరాడ్లతో కొట్టి చంపారు

3 Jul, 2016 17:15 IST|Sakshi
వెదురు బొంగులు, ఇనుపరాడ్లతో కొట్టి చంపారు

భావనగర్: గుజరాత్లో కొందరు గ్రామస్తులు దారుణ చర్యకు దిగారు. ఓ మూడేళ్ల చిరుతను నిర్ధాక్షిణ్యంగా కొట్టి చంపారు. అత్యంత పాశవికంగా చేసిన ఈ చర్య కెమెరా కంటికి చిక్కింది. దీంతో వన్యప్రాణుల సంరక్షణ చట్టం కింద కేసు నమోదుచేసి పోలీసులు విచారణ చేపట్టనున్నారు. భావనగర్ జిల్లా రాజ్ మల్ అనే గ్రామంలోకి శుక్రవారం ఓ చిరుత అడవి నుంచి తప్పిపోయి వచ్చింది.

అది కాస్త గ్రామస్తుల కంటపడటంతో వారు ఉచ్చుపన్నారు. అంతేకాకుండా గత కొద్ది కాలంగా తమ పశువులపైన దాడి చేస్తుందని, చిన్నారులను గాయపరుస్తుందని ఆగ్రహించిన గ్రామస్తులు, వెదురు బొంగులు, ఇనుపరాడ్లు, రాళ్లతో కొట్టారు. ఈ విషయం తెలిసిన అటవీ శాఖ అధికారులు అక్కడికి చేరుకొని దానిని యానిమల్ కేర్ సెంటర్కు తరలించినా తీవ్ర గాయాల కారణంగా ప్రాణాలుకోల్పోయింది.

మరిన్ని వార్తలు