ఏడాదిన్నర బాలికపై అంకుల్ అత్యాచారం

28 Aug, 2016 09:45 IST|Sakshi

వాల్సాద్(గుజరాత్): గుజరాత్‌లో వాల్సాద్ జిల్లాలోని వాపి పట్టణంలో శుక్రవారం రాత్రి ఏడాదిన్నర పాప వరసకు అంకుల్ అయ్యే వ్యక్తి చేతిలో అత్యాచారానికి గురైంది. పాపను ఆమె తల్లిదండ్రులు అతని సమక్షంలో వదిలి వెళ్లినపుడు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.

నిందితుడు వాపి మున్సిపాలిటీలో డ్రైవరుగా పనిచేస్తున్నాడని చెప్పారు. పాపను పట్టణంలోని ఓ ఆసుపత్రిలో చేర్పించి వైద్యం అందిస్తున్నారు. నిందితునిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బాధిత బాలిక తండ్రి నేపాల్ నుంచి వలస వచ్చి ఇక్కడ వాచ్‌మాన్‌గా పనిచేస్తున్నాడు.

మరిన్ని వార్తలు