పంజాబ్‌ బరిలో 1,145 మంది

24 Jan, 2017 03:37 IST|Sakshi
పంజాబ్‌ బరిలో 1,145 మంది

చండీగఢ్‌: 117 అసెంబ్లీ స్థానాలున్న పంజాబ్‌ ఎన్నికల బరిలో 1,145 మంది ఉన్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వీకే సింగ్‌ చెప్పారు. సోమవారం నామినేషన్ల ఉపసంహరణకు గడువు పూర్తయింది. కాంగ్రెస్‌ 117 స్థానాల్లో, ఆప్‌ 112, అకాలీదల్‌ 94, బీజేపీ 23 చోట్ల అభ్యర్థులను నిలబెట్టగా.. బీఎస్పీ 111, తృణమూల్‌ 20 చోట్ల పోటీ చేస్తున్నాయి.

మరిన్ని వార్తలు