మీరు జర్నలిస్తులు.. వారిని మీరే గుర్తించాలి

28 Aug, 2014 16:24 IST|Sakshi
మీరు జర్నలిస్తులు.. వారిని మీరే గుర్తించాలి
లక్నో: మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు.. నా కోడుకుపై రూమర్లు సృష్టిస్తున్న వారిని మీరే పట్టుకోవాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల్ని ఖండించారు. తన కుమారుడిపై రూమర్లు సృష్టిస్తున్న వారేవరో తనకు తెలియదని.. వారి గురించి తాను ఆలోచించడం లేదని ఓ ప్రశ్నకు రాజ్ నాథ్ స్పందించారు. 
 
తన కుటుంబ సభ్యుల దుష్ప్రవర్తన ఉన్నట్టు రుజువైనట్లయితే తాను రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని రాజ్ నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. రాజ్ నాథ్ కుమారుడు పంకజ్ ప్రవర్తనపై ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించిన సంగతి తెలిసిందే.
మరిన్ని వార్తలు