సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా రాకేశ్‌ ఆస్థానా

23 Oct, 2017 06:16 IST|Sakshi

న్యూఢిల్లీ: నిఘా, భద్రత, దర్యాప్తు విభాగాల్లో అధికారులకు పదోన్నతులు కల్పించడం ద్వారా కేంద్ర ప్రభుత్వం ఆదివారం కీలక మార్పులు చేసింది. ఐపీఎస్‌ అధికారులు రాకేశ్‌ ఆస్థానాను సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా, గుర్బాచన్‌ సింగ్‌ను ఇంటెలిజెన్స్‌ బ్యూరో ప్రత్యేక డైరెక్టర్‌గా, సుదీప్‌ లఖ్తాకియాను సీఆర్‌పీఎఫ్‌ ప్రత్యేక డైరెక్టర్‌ జనరల్‌గా కేంద్ర ప్రభుత్వం నియమించింది. రాజేశ్‌ రంజన్, ఏపీ మహేశ్వరిలకు బీఎస్‌ఎఫ్‌లో ప్రత్యేక డైరెక్టర్‌ జనరళ్లుగా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఈ వివరాలను కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం వెల్లడించింది.

>
మరిన్ని వార్తలు