టీచర్పై సామూహిక అత్యాచారం

1 Sep, 2014 14:57 IST|Sakshi
టీచర్పై సామూహిక అత్యాచారం

మెయిన్పురి: ఉత్తరప్రదేశ్లో నిత్యం మహిళలపై దాడులు జరుగుతూనే ఉన్నాయి. ఓ టీచర్పై ముగ్గురు దుండగులు సామూహిక అత్యాచారం చేసి విలువైన వస్తువులు దోచుకెళ్లారు. యూపీలోని భోన్గాన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని నాగ్లా మధు గ్రామంలో ఈ సంఘటన జరిగింది.

బాధితురాలు స్కూలుకు వెళ్తున్న సమయంలో దుండగులు ఆమెపై దాడి చేశారు. ఆమె నుంచి బంగారు చైన్, ఐదు వేల రూపాయిల నగదు దోచుకున్నారు. అనంతరం పొదలచాటుకు లాక్కెళ్లి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. టీచర్ కేకలు విన్న స్థానికులు ఓ నిందితుడి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని మిగిలిన ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.

మరిన్ని వార్తలు