ముంబై: గుజరాత్, కాశ్మీర్లలో ముస్లింల హత్యలకు ప్రతీకారంగా భారత్ను టార్గెట్ చేసుకుంటామని, ప్రధాని మోదీపై పగ తీర్చుకుంటామని తాలిబన్లు చేసిన హెచ్చరికంపై శివసేన మండిపండింది. మోదీ విషయంలో వారు హద్దులు దాటొద్దని తన అధికార పత్రిక ‘సామ్నా’ లో శుక్రవారం హెచ్చరించింది. మోదీ భద్రతకు అన్ని చర్యలూ తీసుకుంటామని శివసేన ప్రకటించింది. ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా కాదని ఈ సందర్భంగా పేర్కొంది
కేంద్ర కేబినెట్ విసర్తణ కోసం శివసేన వైపు నుంచి ఇద్దరి పేర్లు సిఫార్సు చేయాలని ప్రధానమంత్రి కార్యాలయం గురువారం ఆ పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రేను కోరిన నేపథ్యంలో సామ్నాకు ఆయనకు మద్దతు పలకడం గమనార్హం.