నేడు 40 మంది భారత ఖైదీల విడుదల

29 Nov, 2014 03:02 IST|Sakshi

కరాచీ: భారత్, పాకిస్తాన్‌ల మధ్య సత్సంబంధాలు మెరుగుపడుతున్నాయి. ఈ దిశగా మరో ముందడుగు పడింది. ఇరు దేశాల ప్రధానమంత్రుల కరచాలనం.. పలువురు ఖైదీలకు విముక్తిని ప్రసాదించింది. కరాచీ జైలు నుంచి 40 మంది భారత ఖైదీలను విడుదల చేయాలని పాకిస్తాన్ ప్రభుత్వం శుక్రవారం నిర్ణయించింది. ఖైదీలను శనివారం వాఘా సరిహద్దు వద్ద భారత్‌కు అప్పగిస్తామని ప్రకటించింది.

>
మరిన్ని వార్తలు