'ఓకేకానీ.. అది ఎప్పుడు చేస్తారో చెప్పండి'

6 Dec, 2015 12:25 IST|Sakshi
'ఓకేకానీ.. అది ఎప్పుడు చేస్తారో చెప్పండి'

ముంబయి: శివసేన పార్టీ మరోసారి బీజేపీని, ఆరెస్సెస్ను టార్గెట్ చేసింది. తాను బతికుండగానే రామ మందిరం నిర్మాణం పూర్తి అవుతుందని చెప్పిన ఆరెస్సెస్ చీఫ్‌ మోహన్ భగవత్ వ్యాఖ్యలను తాము ఆహ్వానిస్తున్నామని, అయితే ఆయన కేవలం ప్రకటనలతో సరిపెడితే సరిపోదని ఆ పార్టీ పేర్కొంది.

సరిగ్గా రామమందిరం ఎప్పుడు పూర్తి చేస్తారో తమకు స్పష్టతనివ్వాలని, ఒక తేదిని ప్రకటించాలని ఆ తేదీలోగా రామమందిరం పూర్తవుతుందని చెప్పాలని డిమాండ్ చేసింది. తన అధికారిక పత్రిక సామ్నాలో ఆదివారం రాసిన ఎడిటోరియల్లో శివసేన ఈ వ్యాఖ్యలను చేసింది. ఈ అంశం ఎప్పటి నుంచో పెండింగ్లో ఉందని ఇక అలా ఉంచడానికి వీల్లేదని వెంటనే ఓ పరిష్కారం కనుగొనాలని ఆయన డిమాండ్ శివసేన సూచించింది.
 

మరిన్ని వార్తలు