పుదుచ్చేరి: క్రిస్మస్ రోజున ఓ యువతిపై మృగాళ్లు గ్యాంగ్ రేప్కు పాల్పడ్డారు. బాధితురాలు, పోలీసులు తెలిపిన వివరాలు.. పుదుచ్చేరిలోని కరైక్కల్ను చూసేందుకు స్నేహితులతో కలసి వచ్చిన 21 ఏళ్ల పర్యాటకురాలిని బుధవారం ముగ్గురు గుర్తుతెలియని వ్యక్తులు అపహరించి అత్యాచారానికి పాల్పడ్డారు.
తనను రక్షించండంటూ ఆమె కేకలు వేయడంతో వారు పారిపోయారు. కేకలు విని అక్కడికొచ్చిన మరో ఏడుగురు యువకులు ఆమెను వేరేచోటకు తీసుకెళ్లి అత్యాచారం చేశారు. పోలీసులు 15 మందిని అనుమానితులుగా గుర్తించి 12 మందిని అరెస్టు చేశారు.