యశవంతపుర: రాష్ట్రం గౌరవం కాపాడటంతో జాతీయ పార్టీలు ఘోరంగా విఫలమైనట్లు నటి, జేడీఎస్ స్టార్ క్యాంపెయినర్ పూజాగాంధీ ఆరోపించారు. సోమవారం ఆమె కన్నడ జిల్లా కార్వార్లో జేడీఎస్ అభ్యర్థి ఆనంద అస్నోటికర్కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారవార అంబేడ్కర్ సర్కిల్లో జరిగిన ఎన్నికల బహిరంగసభలో అమె కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. కర్ణాటక ప్రతిష్టను కాపాడటంతో కాంగ్రెస్, బీజేపీలో ఘోరంగా విఫలమైనట్లు మండిపడ్డారు.