24 నుంచి కాంగ్రెస్‌ మలివిడత ప్రచారం

22 Oct, 2018 02:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ మలివిడత ఎన్నికల ప్రచారాన్ని ఈ నెల 24 నుంచి ప్రారంభించనుం ది. ఆదివారం హైదరాబాద్‌లోని గోల్కొండ హోటల్‌లో జరిగిన కాంగ్రెస్‌ ముఖ్య నేతల సమావేశంలో ఈ మేరకు నిర్ణయించారు. టీపీసీసీ ఎన్నికల ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన జరిగిన సమావేశానికి టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారా ల ఇన్‌చార్జి ఆర్సీ కుంతియా, కొప్పుల రాజు, విజయశాంతి, మాజీ మంత్రి డీకే అరుణ తదితరులు హాజరయ్యారు.

పార్టీ ఎన్నికల ప్రచారం ఎప్పుడు ప్రారంభించాలి? మొదటి విడత ప్రచారం ఎలా సాగిందన్న దానిపై నేతలు చర్చిం చారు. ఇప్పటివరకు మహబూబ్‌నగర్‌ జిల్లాలో జరిగిన ఎన్నికల ప్రచారం చాలా బాగుందని, ఇదే ఒరవడిని కొనసాగించాలని నేతలు అభిప్రాయపడ్డారు.  మలివిడత షెడ్యూల్‌ను సోమవారం విడుదల చేసేందుకు  భట్టి  ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు సమాచారం.

టీపీసీసీ అధికార ప్రతినిధిగా శ్రీరంగం సత్యం
సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ అధికార ప్రతినిధిగా శ్రీరంగం సత్యం నియమితులయ్యారు. ఆయన్ను పార్టీ అధికార ప్రతినిధిగా నియమిస్తూ టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. శ్రీరంగం సత్యం రాష్ట్ర బిల్డర్స్‌ అసోసియేషన్, బ్రాహ్మణ సంఘంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో మేడ్చల్‌ అసెంబ్లీ సీటును ఆశిస్తున్నారు. అధికార ప్రతినిధిగా నియమించినందుకు సత్యం టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేశారు.

మరిన్ని వార్తలు