దాడులను ప్రతీ ఒక్కరు ఖండిచాలి: ఫరుఖ్‌

4 Apr, 2018 16:46 IST|Sakshi

న్యూఢిల్లీ : కశ్మీర్‌లో  జరుగుతున్న దాడులను ప్రతి ఒక్కరు ఖండించాల్సిందేనని జమ్మూ కశ్మీర్‌ మాజీ ముఖ్యమత్రి ఫరుఖ్‌ అబ్దుల్లా పేర్కొన్నారు. కశ్మీర్‌ లోయలో జరుగుతున్న కాల్పుల వల్ల  అమాయక ప్రజలు  ప్రాణాలు కోల్పోతున్నారని, ఈ దుశ్చర్యను ప్రపంచ దేశాలు ఖండించాలని ఆయన కోరారు. కాగా కశ్మీర్‌లో జరుగుతున్న దాడులపై ఐక్యరాజ్య సమితి స్పందించాలని పాక్‌ క్రికెటర్‌ షాహిద్‌ అఫ్రిదీ పలు వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఆయన చేసిన వ్యాఖ్యలుకు మద్దతుగా ఫరుఖ్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. కాగా కశ్మీర్‌లో పరిస్థితి మరింత దిగజారపోయిందని, శాంతి నెలకొల్పేందుకు భారత ప్రభుత్వం పాక్‌తో చర్చలు ప్రారంభించాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ముప్తీ మహ్మాద్‌ భారత ప్రభుత్వాన్ని కోరిన విషయం విదితమే.

>
మరిన్ని వార్తలు