బీజేపీ మన పార్టీయే అంటున్న జేసీ

6 Jan, 2020 06:33 IST|Sakshi
బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌తో కరచాలనం చేసి మాట్లాడుతున్న జేసీ దివాకర్‌రెడ్డి

బీజేపీ నేత సత్యకుమార్‌తో జేసీ దివాకర్‌రెడ్డి

సాక్షి, అనంతపురం : ‘‘బీజేపీ మన పార్టీ....అందుకే నాకు అభిమానం’’ అని టీడీపీ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన అనంతపురంలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ను కలిశారు. బొకే అందించి మాట కలిపారు. సోమవారం అనంతపురం రానున్న కేంద్ర సహాయక హోంశాఖ మంత్రి కిషన్‌రెడ్డిని కూడా కలుస్తానన్నారు.  

మరిన్ని వార్తలు