బీజేపీకి షాక్‌.. కీలక నేత రాజీనామా

23 Oct, 2018 19:47 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌ : ఎన్నికల ముందు భారతీయ జనతా పార్టీకి కరీంనగర్‌ జిల్లాలో భారీ షాక్‌ తగిలింది. జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొత్త శ్రీనివాస్‌రెడ్డి పార్టీ ప్రాధమిక సభ్యత్వానికి, అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు డాక్టర్‌ లక్ష్మణ్‌కు అందజేశారు. పార్టీలో సరైన ప్రాధాన్యత లేకపోవడం, హూస్నాబాద్‌ టికెట్‌ ఇవ్వడంలో నిర్లక్ష్యం చేయడంతోనే రాజీనామా చేసినట్లు కొత్త  శ్రీనివాస రెడ్డి వెల్లడించారు.

మరిన్ని వార్తలు