కేసీఆర్‌ పాలనపై ప్రజలు విసిగిపోయారు

10 Feb, 2018 01:34 IST|Sakshi

బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కేసీఆర్‌ అస్తవ్యస్త పాలన పట్ల ప్రజలు విసిగిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ పరిధిలో భారీగా భూ కుంభకోణాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

శుక్రవారం ఆదిలాబాద్, సిర్పూర్‌ కాగజ్‌నగర్, తాండూరు నియోజకవర్గాలకు చెందిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీల నాయకులు, కార్యకర్తలు బీజేపీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లక్ష్మణ్‌ వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారిని ఉద్దేశించి మాట్లాడారు. అవినీతిలో కూరుకుపోయిన కాంగ్రెస్‌ పార్టీ దేశాన్ని దోచుకుంటే.. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు.

మరిన్ని వార్తలు