సాక్షి, హైదరాబాద్: జమిలి ఎన్నికలు వస్తే ప్రధాని మోదీ చరిష్మా ముందు తాను నిలబడలేనన్న భయంతోనే సీఎం కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు వెళుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ అన్నారు. చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చార్జిగా బి.జనార్దన్రెడ్డిని నియమిస్తూ లక్ష్మణ్ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు.
అనంతరం లక్ష్మణ్ మాట్లాడుతూ.. తమకు ఎన్నికలు కొత్త కాదని, ఎన్నికల కోసం పనిచేసే పార్టీ అంతకన్నా కాదని, నిరంతరం ప్రజల కోసం పనిచేసే పార్టీ అని అన్నారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా పోటీ చేసే యంత్రాంగం తమ దగ్గర ఉందన్నారు. అనంతరం జనార్దన్రెడ్డికి నియామక పత్రాలను అందజేశారు. తన మీద నమ్మ కం ఉంచి చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం ఇన్చా ర్జిగా బాధ్యతలు అప్పగించిన లక్ష్మణ్, కేంద్ర నాయకత్వానికి జనార్దన్రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రస్తుత రాజకీయాల్లో విలువలు లేవు..
ప్రస్తుత రాజకీయాల్లో విలువలు లేవని లక్ష్మణ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శనివారం జరిగిన కవి సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు.