కంచ ఐలయ్యపై చర్యలేవి: ఎమ్మెల్యే ప్రభాకర్‌

10 Nov, 2017 02:08 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఆర్య వైశ్యులను స్మగ్లర్లు అని అభివర్ణిస్తూ పుస్తకం రాసిన కంచ ఐలయ్యపై ప్రభుత్వం ఇప్పటిదాకా ఎందుకు చర్యలు తీసుకోలేదని బీజేపీ ఎమ్మెల్యే ఎన్‌.వి.ఎస్‌.ఎస్‌.ప్రభాకర్‌ ప్రశ్నించారు.

ఒక వర్గాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసినా, రాతలు రాసినా ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకునే అవకాశాలు ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.  ఆర్యవైశ్యులకు కార్పొరేషన్‌ను ఏర్పాటుచేయాలని ప్రభాకర్‌ కోరారు.  

మరిన్ని వార్తలు