ఎంఐఎం గుర్తింపు రద్దు చేయాలంటూ పిటిషన్‌

5 Sep, 2018 14:59 IST|Sakshi

ఢిల్లీ: ఆల్‌ ఇండియా మజ్లిస్‌ ఇత్తెహదుల్‌ ముస్లిమీన్‌(ఏఐఎంఐఎం) పార్టీ గుర్తింపు రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టులో శివసేన తెలంగాణ అధ్యక్షుడు తిరుపతి నరసింహ మురారి పిటిషన్‌ దాఖలు చేశారు.ఆర్టికల్‌ 226 కింద ఎలక్షన్‌ కమిషన్‌ ఇచ్చిన గుర్తింపును రద్దు చేయాలని పిటిషన్‌లో పేర్కొన్నారు. లౌకిక వాదానికి వ్యతిరేకంగా ఎంఐఎం పార్టీ పనిచేస్తోందంటూ ఎంఐఎం సిద్ధాంతాల జాబితాను ఢిల్లీ హైకోర్టుకు మురారి సమర్పించారు.

మరిన్ని వార్తలు