పుట్టిన రోజుకు డబ్బులు ఇవ్వలేదని..

17 May, 2019 10:12 IST|Sakshi
క్షతగాత్రుడితో మాట్లాడుతున్నసీఐ శ్రీధర్‌రెడ్డి

మార్కాపురం: తన పుట్టిన రోజుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని కాల్చుకుంటానని బెదిరిస్తుండగా వారించబోయిన తల్లిదండ్రులకు నిప్పంటుకుని గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం సాయంత్రం పట్టణ పోలీసుస్టేషన్‌ పరిధిలోని ఎస్సీ, బీసీ కాలనీలో జరిగింది. సీఐ శ్రీధర్‌రెడ్డి కథనం ప్రకారం.. కాలనీలో నివాసం ఉండే మురారి గాలెయ్య కుమారుడు ప్రసాద్‌ది గురువారం పుట్టిన రోజు. తాను పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలని డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను కోరాడు. ప్రస్తుతానికి లేవని, తర్వాత ఇస్తానంటూ తండ్రి గాలెయ్య సమాధానం చెప్పడంతో కోపోద్రిక్తుడైన ప్రసాద్‌ ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని అగ్గిపుల్ల ముట్టించుకున్నాడు. కుమారుడిని వారించే యత్నంలో గాలెయ్య ప్రసాద్‌ను పట్టుకోగా ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి. వీరిరువురిని కాపాడేందుకు గాలెయ్య భార్య లక్ష్మి, గాలెయ్య తల్లి వెంకమ్మలు ప్రయత్నించగా వారికి కూడా గాయాలయ్యాయి. అందరినీ చికిత్స కోసం జిల్లా వైద్యశాలకు తరలించారు. క్షణికావేశం నలుగురి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. 

మరిన్ని వార్తలు