-
పుట్టిన రోజుకు డబ్బులు ఇవ్వలేదని..
మార్కాపురం: తన పుట్టిన రోజుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఒంటిపై పెట్రోల్ పోసుకుని కాల్చుకుంటానని బెదిరిస్తుండగా వారించబోయిన తల్లిదండ్రులకు నిప్పంటుకుని గాయాలయ్యాయి. ఈ సంఘటన గురువారం సాయంత్రం పట్టణ పోలీసుస్టేషన్ పరిధిలోని ఎస్సీ, బీసీ కాలనీలో జరిగింది. సీఐ శ్రీధర్రెడ్డి కథనం ప్రకారం.. కాలనీలో నివాసం ఉండే మురారి గాలెయ్య కుమారుడు ప్రసాద్ది గురువారం పుట్టిన రోజు. తాను పుట్టిన రోజు వేడుకలు చేసుకోవాలని డబ్బులు ఇవ్వాలని తల్లిదండ్రులను కోరాడు. ప్రస్తుతానికి లేవని, తర్వాత ఇస్తానంటూ తండ్రి గాలెయ్య సమాధానం చెప్పడంతో కోపోద్రిక్తుడైన ప్రసాద్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని అగ్గిపుల్ల ముట్టించుకున్నాడు. కుమారుడిని వారించే యత్నంలో గాలెయ్య ప్రసాద్ను పట్టుకోగా ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి. వీరిరువురిని కాపాడేందుకు గాలెయ్య భార్య లక్ష్మి, గాలెయ్య తల్లి వెంకమ్మలు ప్రయత్నించగా వారికి కూడా గాయాలయ్యాయి. అందరినీ చికిత్స కోసం జిల్లా వైద్యశాలకు తరలించారు. క్షణికావేశం నలుగురి ప్రాణాలకు ముప్పు తెచ్చింది. -
ఆ దుర్ఘటన ఇంకా వెంటాడుతోంది...
మాసాయిపేట రైలు దుర్ఘటన ఇంకా వెంటాడుతోంది. తల్లుల గర్భశోకాలు.. చిన్నారుల తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి. దుర్ఘటన జరిగి నేటికి ఏడాది పూర్తయింది. ఇస్లాంపూర్లో స్వామి, పుష్ప దంపతులు తమ కుమారుని ప్రతి రూపాన్ని (విగ్రహం) తయారు చేయించుకుని నిత్యం తమ కళ్లముందు ఉండేలా వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసుకున్నారు. మరో దంపతులు ఉన్న ఇద్దరు పిల్లలను కోల్పోయి ఊరును విడిచి పట్టణానికి వలస వెళ్లారు. ఇలా ఒక్కో బాధిత కుటుంబానిదీ ఒక్కో వ్యథ.. తీరని గర్భశోకం.. - చెరగని చిన్నారుల గుర్తులు - కళ్ల ముందు కదలాడుతున్న చిన్నారుల జ్ఞాపకాలు - మాసాయిపేట ఘటన జరిగి నేటికి ఏడాది - బాధిత కుటుంబాల్లో తీరని వేదన - స్మృతివనం ఏర్పాటయ్యేనా? తూప్రాన్/వెల్దుర్తి: రైలు ప్రమాదంలో చిన్నారులను కోల్పోయిన తల్లిదండ్రుల వేదనకు నేటితో ఏడాది. సరిగ్గా ఏడాది క్రితం రోజులాగే తెల్లారింది, ఎప్పటిలాగే ఆ చిన్నారులు ఆడుతూ పాడుతూ స్కూల్కు బస్సులో బయలుదేరారు. మరో పది నిమిషాల్లో స్కూలుకు చేరుకునేలోపు... అటుగా వస్తున్న నాందేడ్ ప్యాసింజర్ రైలు... స్కూల్ బస్సును ఢీ కొట్టింది. ఇంకేముంది? కళ్లుమూసి తెరిచేలోపు బస్సు తుక్కుతుక్కైంది. అందులోని చిన్నారులు హాహాకారాలు చేస్తూ రైలు పట్టాల పక్కన ఎగిరిపడ్డారు. బస్సులో మొత్తం 34 మంది చిన్నారుల్లో ఉండగా డ్రైవర్, క్లీనర్తో పాటు 14 మంది చిన్నారులు సంఘటన స్థలంలో ఈ లోకాన్ని వదిలారు. మరో 20 మంది చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందారు. వీరిలో ఇద్దరు చిన్నారులు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. మొత్తం 16 మంది చిన్నారులు రైలు ప్రమాదంలో విగత జీవులయ్యారు. వెల్దుర్తి మండలం మాసాయిపేట వద్ద 2014 జులై 24న జరిగిన రైలు ప్రమాదం జరిగి నేటికి ఏడాది అవుతుంది. మృతులంతా తూప్రాన్ మండలానికి చెందిన ఇస్లాంపూర్, గుండ్రెడ్డిపల్లి, వెంకటాయిపల్లి, కిష్టాపూర్ గ్రామాలకు చెందిన 13 ఏళ్లలోపు వారే. ఈ ఘటనతో యావత్ దేశం ఉలిక్కిపడింది. రైల్వేగేటు లేకపోవడం, రైలు వస్తున్న విషయాన్ని బస్సు డ్రైవర్ గుర్తించకపోవడం.. వెరసి ముక్కుపచ్చలారని పసిమొగ్గల బంగారు భవిష్యత్తు గాల్లో కలిసింది. ఘటన స్థలంలో తల్లిదండ్రుల రోదనలు, బంధువుల వేదనలు.. స్థానికుల ఆందోళనలు.. రాజకీయ నేతల పరామర్శలతో ఆ ప్రాంతమంతా హృదయ విదారకరంగా మారిపోయింది. ఘటన స్థలమంతా మరుభూమిని తలపించింది. ఘటనా స్థలంలో విద్యార్థుల స్కూల్ బ్యాగులు, పుస్తకాలు, టిఫిన్ బాక్స్లు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. టిఫిన్ బాక్స్ల్లోని అన్నం మెతుకులు చిన్నారుల రక్తంతో తడిసి నెత్తుటి ముద్దలుగా కన్పించాయి. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే తల్లిదండ్రులు, బంధువులు రోదిస్తూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. వారి రోదనలతో ఆ ప్రాంతమంతా దద్దరిల్లింది. ప్రతి ఒక్కరు కన్నీరు పర్యంతమయ్యారు. స్మృతివనం ఏర్పాటు చేయక.. ఈ సంఘటనతో మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు, ఇతర పార్టీల నాయకులు సంఘటన స్థలానికి చేరుకుని కన్నీరు పెట్టారు. ఘటనా స్థలం వద్ద పిల్లల జ్ఞాపకార్థం మూడు నెలల్లో స్మృతివనం ఏర్పాటు చేసి స్థూపాన్ని నిర్మిస్తామని మంత్రులు ప్రకటించారు. మూడు నెలల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ఏడాది గడుస్తున్నా నేటికి స్మృతివనం ఏర్పాటు చేయకపోవడంతో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల ఆత్మలు ఘోషిస్తున్నాయి. ఇప్పటికైనా స్మృతివనం ఏర్పాటు చేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. రెండేళ్ల క్రితమే సాక్షి కథనాలు.. రైల్వే క్రాసింగ్ వద్ద గేట్లు లేకపోవడంతో ముంచుకొచ్చే ప్రమాదాలపై రెండేళ్ల నుంచి సాక్షి కథనాలు రాసింది. ఈ దుర్ఘటన కంటే ఆరు నెలల ముందు తూప్రాన్లోని ఓ ప్రవేటు పాఠశాలకు చెందిన బస్సు 30 మంది విద్యార్థులలో మాసాయిపేట నుంచి రైల్వే క్రాసింగ్ దాటే సమయంలో బస్సు చెడిపోయి పట్టాలపై ఆగిపోయింది. అప్పటికే శ్రీనివాసనగర్స్టేషన్ నుంచి బయలుదేరిన రైలు కూతపెట్టుకుంటూ రావడంతో ఉలిక్కిపడ్డ విద్యార్థులు ప్రాణాలు కాపాడుకోవడానికి బస్సు నుంచి దిగుతుండగా గమనించిన రైలు డ్రైవర్ ఒక్కసారిగా బ్రేకు వేయడంతో పట్టాలపై ఉన్న బస్సుకు రెండు గజాల దూరంలో ఆగిపోయింది. దీంతో పెనుప్రమాదం తప్పిన ఆరు నెలల కాలంలోనే ఈ దుర్ఘటన జరిగింది. అండర్ బ్రిడ్జి నిర్మాణం తప్పనిసరి.. శ్రీనివాస్ నగర్ రైల్వే స్టేషన్లో అండర్గ్రౌండ్ బ్రిడ్జిని నిర్మిస్తామని పాలకులు హామీ ఇచ్చి ఏడాది గడుస్తున్నా హామీగానే మిగిలింది. ఈ రైల్వే స్టేషన్లో ఉన్న రైలు పట్టాల మీదుగా ప్రజలు, విద్యార్థులు వందలాది మంది రైలు పట్టాలు దాటుతూ ఉంటారు. ఎప్పుడు ఏ ప్రమాదం ముంచుకొస్తుందోనని అర చేతిలో ప్రాణాలు పెట్టుకున్న పట్టాలు దాటుతున్నారు. ఇప్పటికైనా పాలకులు, రైల్వే శాఖ అధికారులు బ్రిడ్జిని నిర్మించాలని డిమాండ్ చేస్తున్నారు. నీటి సుడులు తిరుగుతూనే ఉన్నాయి... బాధితుల మదిలోంచి చిన్నారుల జ్ఞాపకాలు చెదిరిపోలేదు. వారి మధుర జ్ఞాపకాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. ఇద్దరు పిల్లలు కోల్పోయిన తల్లిదండ్రుల పరిస్థితి వర్ణనాతీతం.. ఎదిగిన కొడుకును మరిచిపోలేక ఆ దంపతులు కుమారుని ప్రతి రూపాన్ని (విగ్రహం) తయారు చేయించుకుని నిత్యం తమ కళ్లముందు ఉండేలా తన వ్యవసాయ పొలంలో ఏర్పాటు చేసుకున్నారు. ఓ తల్లి తన పిల్లల లేరన్న సంఘటనను జీర్ణించుకోలేక మతిస్థిమితం కోల్పోయి హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. మరో తల్లి ముగ్గురు పిల్లల్లో ఇద్దరు పిల్లలను కోల్పోయి ప్రాణాలతో బయటపడ్డ కూతురును ఆ వాతవరణం నుంచి దూరంగా పెంచేందుకు ఊరునే వదిలేశారు. మరో దంపతులు ఉన్న ఇద్దరు పిల్లలను కోల్పోయి ఉన్న ఊరును విడిచి పట్టాణానికి వచ్చి బతుకుతున్నారు. ఇలా బాధిత కుటుంబాలు మనో ధైర్యం కోల్పోయి బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఎండుతున్న జలకళ
రెండు యుద్ధాలు – ఒక నాయకుడు
షూటింగ్... పార్టీయింగ్...
బాక్ సరికొత్త అనుభూతి ఇస్తుంది : తమన్నా
అజిత్కి జోడీగా...
బయటే డాబు.. లోపల బాబ్బాబు! రెండు నాల్కల చంద్రం
Lok sabha elections 2024: కాంగ్రెస్, ఆప్...మిత్రభేదం
బిందువే సిరుల సింధువు
చెన్నైకి గేమ్
పశ్చిమాసియా ఘర్షణ ఆర్థికానికి చేటే!
తప్పక చదవండి
- సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభల రేపటి షెడ్యూల్ ఇదే..
- మస్క్కు లైన్ క్లియర్?..చైనాలో టెస్లా సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు..
- ములాయం సింగ్ కుటుంబం అంటే బీజేపీకి భయం
- చేరిన మూడునెలలకే ఓలా క్యాబ్స్ సీఈవో రాజీనామా.. 200 మంది ఉద్యోగుల తొలగింపు
- కేజ్రీవాల్ కొత్త ఆదేశాలు: మీడియాతో వెల్లడించిన అతిషి
- సీఎం మమత సర్కార్కు సుప్రీం కోర్టులో ఊరట
- బిహార్లో ఎవరూ ఊహించని ఫలితాలు
- యూసీసీ వల్ల ప్రయోజనం లేదు: మమతా బెనర్జీ
- ‘కాపులను పవన్ కల్యాణ్ ఎదగనీయటం లేదు’
- కాంగ్రెస్ అనుకున్నదాన్ని జరగనివ్వను: ప్రధాని మోదీ
Advertisement