క్వార్టర్స్‌లో సాకేత్ జంట

30 Apr, 2015 01:17 IST|Sakshi
క్వార్టర్స్‌లో సాకేత్ జంట

న్యూఢిల్లీ: ఏటీపీ చాలెంజర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ ప్లేయర్ సాకేత్ మైనేని తన భాగస్వామి యూకీ బాంబ్రీతో కలిసి డబుల్స్ విభాగంలో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. తైపీలో జరుగుతున్న ఈ టోర్నీలో పురుషుల డబుల్స్ తొలి రౌండ్‌లో సాకేత్-యూకీ బాంబ్రీ ద్వయం 6-3, 2-6, 10-7తో యుయా కిబి-తకుటో నికి (జపాన్) జంటపై గెలిచింది. సింగిల్స్‌లో భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్‌కు తొలి రౌండ్‌లోనే ఓటమి ఎదురైంది. రామ్‌కుమార్ 6-2, 3-6, 6-7 (3/7)తో జిమ్మీ వాంగ్ (చైనీస్ తైపీ) చేతిలో ఓటమి పాలయ్యాడు.

మరిన్ని వార్తలు