కృనాల్‌ దెబ్బకు ఆసీస్‌ విలవిల

25 Nov, 2018 15:08 IST|Sakshi
కృనాల్‌ పాండ్యా

సిడ్నీ : మూడు టీ20 సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న చివరి టీ20లో భారత ఆల్‌రౌండర్‌ కృనాల్‌ పాండ్యా బంతితో చెలరేగాడు. తొలి మ్యాచ్‌లో దారుణంగా పరుగులు సమర్పించుకోని విమర్శలపాలైన కృనాల్‌.. ఈ మ్యాచ్‌లో రాణించి లెక్కసరిచేశాడు. కృనాల్‌ దెబ్బకు ఆసీస్‌.. భారత్‌కు 165 పరుగుల సాధారణ లక్ష్యాన్ని నిర్ధేశించింది. టాస్‌ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ను కృనాల్‌ (4/36) దెబ్బతీశాడు. ఆసీస్‌ బ్యాట్స్‌మెన్‌లో.. డీఆర్సీ షార్ట్‌ (33), ఆరోన్‌ ఫించ్‌ (28), క్యారీ (27), స్టోయినిస్‌ (25 నాటౌట్‌)లు రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లకు ఆసీస్‌ ఆరు వికెట్లు కోల్పోయి 164 పరుగులు చేసింది. భారత బౌలర్లలో కృనాల్‌కు నాలుగు, కుల్దీప్‌ ఒక వికెట్‌ దక్కింది.

మరిన్ని వార్తలు