ద్యుతీ... పరుగు, పయనంపై పుస్తకం 

19 Sep, 2018 01:48 IST|Sakshi

భారత స్ప్రింట్‌ స్టార్‌ ద్యుతీచంద్‌ పరుగు పోరాటం త్వరలో పుస్తక రూపంలో రానుంది. జర్నలిస్ట్‌ సందీప్‌ మిశ్రా ఆమె ఆత్మకథను రాస్తున్నట్లు వెల్లడించారు. పేదరికాన్ని జయించి ‘ట్రాక్‌’ బాట పట్టిన ఆమెలో పురుషత్వ లక్షణాలున్నాయని నిషేధం విధించడంతో ఈ ఒడిషా అథ్లెట్‌ ఆర్బిట్రేషన్‌ కోర్టులో పోరాడి గెలిచింది.

 తర్వాత అంతర్జాతీయ ఈవెంట్లలో పతకాల కోసం పోరాడుతోంది. చెమట చిందించిన ఆమె పరుగు... పయనం... వచ్చే ఏడాది పుస్తకంగా రానుంది. ఇటీవలే ముగిసిన ఆసియా క్రీడల్లో ద్యుతీ 100 మీ., 200 మీ. పరుగులో రెండు రజతాలు నెగ్గింది.   

మరిన్ని వార్తలు