సెపక్‌తక్రా జట్లకు కెప్టెన్లుగా దినేశ్, తరంగిణి

26 Dec, 2019 14:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సీనియర్‌ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌లో పాల్గొనే తెలంగాణ రాష్ట్ర జట్లను బుధవారం ప్రకటించారు. మహిళల జట్టుకు ఎ. తరంగిణి, పురుషుల జట్టుకు డి. దినేశ్‌ కెప్టెన్లుగా ఎంపికయ్యారు. జార్ఖండ్‌లోని రాంచీ వేదికగా ఈనెల 28 నుంచి జనవరి 2 వరకు జాతీయ సెపక్‌తక్రా చాంపియన్‌షిప్‌ జరుగుతుంది.  

జట్ల వివరాలు
పురుషులు: డి. దినేశ్‌ (కెప్టెన్‌), కె. ప్రవీణ్, జి. శ్రీనాథ్, ఎ. హరినాథ్, డి. శశాంక్, ఎం. వికేశ్‌ కుమార్‌ (కోచ్‌), కె. నిఖిల్‌ (మేనేజర్‌).

మహిళలు: ఎ. తరంగిణి (కెప్టెన్‌), ఆర్‌. నవత, కోమల్, బి. శైలజ, ఠాకూర్‌ యోగేశ్వరి, మానసి అవస్థి, ఎస్‌. ఆకాంక్ష, కె. ధనశ్రీ, పి. మాళవిక, నందిని, డి. దివ్య, సాయి ప్రణతి, ఆర్తి, శస్ర, పూజిత, అహ్మద్‌ (కోచ్‌), కపిల్‌ ఆనంద్‌ (కోచ్‌), షబ్రీశ్‌ వర్మ (మేనేజర్‌).

మరిన్ని వార్తలు