పట్టుబిగించిన ఇంగ్లండ్‌

7 Aug, 2017 02:25 IST|Sakshi

మాంచెస్టర్‌: దక్షిణాఫ్రికాతో జరుగుతోన్న నాలుగో టెస్టులో ఇంగ్లండ్‌ పట్టుబిగించింది. తొలి ఇన్నింగ్స్‌లో 136 పరుగుల ఆధిక్యం పొందిన ఇంగ్లండ్‌ అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో మూడో రోజు ఆట నిలిచే సమయానికి 8 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. మొయిన్‌ అలీ (67 బ్యాటింగ్‌), బ్రాడ్‌ (0) క్రీజులో ఉన్నారు.

ప్రస్తుతం ఇంగ్లండ్‌ ఓవరాల్‌గా 360 పరుగుల ఆధిక్యంలో ఉంది. అంతకుముందు 220/9 ఓవర్‌నైట్‌ స్కోరుతో ఆట కొనసాగించిన దక్షిణాఫ్రికా 226 పరుగుల వద్ద ఆలౌటైంది.

మరిన్ని వార్తలు