జాతీయ క్రీడల నిర్వహణకు అవకాశం ఇవ్వండి

19 Jul, 2014 01:35 IST|Sakshi

కేంద్రమంత్రికి చంద్రబాబు లేఖ
 సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2017 జాతీయ క్రీడల నిర్వహణకు అవకాశం ఇవ్వాల్సిందిగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కేంద్ర క్రీడ లు, యువజన సర్వీసుల శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌కు లేఖ రాశారు.
 
  కేంద్ర మంత్రికి సీఎం రాసిన లేఖను రాష్ట్ర యువజన , క్రీడలు, కార్మిక శాఖ మంత్రి కింజరాపు అచ్చన్నాయుడు శుక్రవారం పత్రికలకు విడుదల చేశారు. 39వ జాతీయ క్రీడలు విజయవాడ నగరంలో నిర్వహించేందుకు అవకాశం కల్పించాల్సిందిగా ఆ లేఖలో కోరారు. దీని వల్ల విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ వంటి నగరాల్లోనూ వివిధ రకాల పోటీలు నిర్వహించేందుకు అవకాశం కలుగుతుందని తెలిపారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో జాతీయ క్రీడలను విజయవాడలో నిర్వహించటం వల్ల ప్రపంచస్థాయి సౌకర్యాల కల్పనకు, ఈప్రాంత క్రీడాకారుల అభివృద్ధికి అవకాశం ఏర్పడుతుందని లేఖలో తెలిపారు.
 

మరిన్ని వార్తలు