చివరి మ్యాచ్ ‘డ్రా’

20 Apr, 2014 01:20 IST|Sakshi

చన్‌చన్‌దేవి రెండు గోల్స్
 భారత్, ఐర్లాండ్ మహిళల హాకీ సిరీస్
 
 డబ్లిన్: ఎఫ్‌ఐహెచ్ చాంపియన్స్ చాలెంజ్ టోర్నీ సన్నాహాల్లో భాగంగా ఐర్లాండ్‌తో జరిగిన సిరీస్ చివరి మ్యాచ్‌ను భారత్ ‘డ్రా’ చేసుకుంది. శుక్రవారం జరిగిన చివరిదైన మూడో మ్యాచ్‌ను టీమిండియా 2-2తో ‘డ్రా’గా ముగించింది. డబ్లిన్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ క్రీడాకారిణి చన్‌చన్‌దేవి రెండు గోల్స్ చేసింది.
 
 అనా ఒ ఫ్లాంగన్ ఐర్లాండ్‌కు రెండు గోల్స్ అందించింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరుజట్లు అటాకింగ్ గేమ్ ఆడాయి. ఏడో నిమిషంలో ఐర్లాండ్ ప్లేయర్ ఒ ఫ్లాంగన్ గోల్ చేయగా, 31వ నిమిషంలో చన్‌చన్‌దేవి (భారత్) స్కోరును సమం చేసింది. రెండో అర్ధభాగంలో గోల్స్ కోసం ఇరుజట్లు తీవ్రంగా శ్రమించాయి. అయితే పెనాల్టీ కార్నర్‌ను చక్కని గోల్‌గా మలిచిన చన్‌చన్‌దేవి భారత్‌కు ఆధిక్యాన్ని అందించింది. కానీ 64వ నిమిషంలో ఒ ఫ్లాంగన్ రెండో గోల్ సాధించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. మూడు టెస్టుల ఈ సిరీస్‌ను భారత్ 2-0తో గెలుచుకుంది. తొలి మ్యాచ్‌లో భారత్ 3-1తో, రెండో మ్యాచ్‌లో 2-1తో నెగ్గింది.
 

మరిన్ని వార్తలు