టోర్నీల ఆతిథ్యానికి భారత్‌ దూరం

24 May, 2020 02:46 IST|Sakshi

కేంద్ర క్రీడా మంత్రి కిరణ్‌ రిజిజు ప్రకటన

న్యూఢిల్లీ: సమీప భవిష్యత్‌లో ఎలాంటి అంతర్జాతీయ క్రీడా ఈవెంట్లకు భారత్‌ ఆతిథ్యం ఇవ్వబోదని కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్‌ రిజిజు స్పష్టం చేశారు. దీంతో అక్టోబర్‌–నవంబర్‌లలో ఐపీఎల్‌ జరిగే అవకాశాలున్నాయని వస్తోన్న ఊహాగానాలకు తెరపడినట్లయింది. దేశంలో క్రీడల పునరుద్ధరణ కోసం ప్రయత్నిస్తున్నామన్న రిజిజు... అంతకన్నా ముందు ఆట గాళ్ల ప్రాక్టీస్, శిక్షణ, ఫిట్‌నెస్‌ తమకు ముఖ్యమని పేర్కొన్నారు. స్టేడియాల్లో ప్రేక్షకులు లేకుండానే క్రీడా ఈవెంట్లు నిర్వహించేందుకు అలవాటు పడాలని సూచించారు. ఐపీఎల్‌ నిర్వహణ గురించి మాట్లాడుతూ ఈ పరిస్థితుల్లో కేవలం ఒక్క క్రీడా ఈవెంట్‌ నిర్వహించి అందరి ఆరోగ్యాలను ప్రమాదంలో పడేయలేమని ఆయన పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు