కొలంబో: భారత్-శ్రీలంక టెస్ట్ సిరీస్లో భాగంగా రెండో టెస్టులో కోహ్లి సేన టాస్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకుంది. జ్వరంతో గాలె టెస్టుకు దూరమైన ఓపెనర్ కేఎల్ రాహుల్ జట్టులోకి తిరిగిరాగా.. అభినవ్ ముకుంద్ బెంచ్కే పరిమితమయ్యాడు. శ్రీలంక జట్టులో మూడు మార్పులు జరిగాయి. దనుష్క, కుమార, అసెలాలు గాయాలతో దూరమవ్వగా వారి స్థానంలో శ్రీలంక కెప్టెన్ చండిమల్,మలింద పుష్పకుమార, ధనుంజయా డెసిల్వాలు జట్టులోకి వచ్చారు.
తొలి టెస్టు విజయంతో భారత్ ఉత్సాహంగా ఉండగా.. సొంత గడ్డపై ఓటమి చెందడంతో శ్రీలంకపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. ఈ మ్యాచ్లో విజయం సాధించి సిరీస్ కైవసం చేసుకోవాలని కోహ్లి సేన ఉవ్విళ్లూరుతుంది. ఈ మ్యాచ్లో నెగ్గి సిరీస్ను కాపాడుకోవాలని శ్రీలంక భావిస్తోంది.
తుది జట్లు:
భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, పుజారా, రహానే, అశ్విన్, సాహా, జడేజా, పాండ్యా, ఉమేశ్, షమీ.
శ్రీలంక: చండిమాల్ (కెప్టెన్), తరంగ, కరుణరత్నే, కుషాల్ మెండిస్, మాథ్యూస్, డిక్వెలా, డెసిల్వా పెరీరా, హెరాత్, పుష్పకుమార, ప్రదీప్.