ఆటగాళ్ల గాయాలు దెబ్బతీశాయి: మ్యాథ్యూస్

28 Mar, 2015 00:14 IST|Sakshi

కొలంబో: ఫీల్డింగ్ వైఫల్యానికి తోడు గాయాలతో ఆటగాళ్లు దూరం కావడం ప్రపంచకప్‌లో శ్రీలంక అవకాశాలను దెబ్బతీసిందని కెప్టెన్ ఏంజెలో మ్యాథ్యూస్ అన్నాడు. ‘మా ఫీల్డింగ్ ప్రమాణాలు నాసిరకంగా ఉన్నాయి. అలాగే టోర్నీ కోసం ముందుగా ప్రకటించిన 15 మంది జాబితాలో ఐదుగురు ఆటగాళ్లు గాయాల కారణంగా తప్పుకున్నారు.

ఇక దక్షిణాఫ్రికాతో జరిగిన క్వార్టర్స్‌లో ఆఫ్ స్పిన్నర్ కుశాల్ పెరీరాను ఆడించడంలో మేం ఎలాంటి పొరపాటు చేయలేదు. ఎందుకంటే అతడికదే తొలి వన్డే. ప్రత్యర్థికి అతడి బౌలింగ్ తీరు తెలీదు కాబట్టి ప్రయోగం చేశాం’ అని మ్యాథ్యూస్ చెప్పుకొచ్చాడు.
 

మరిన్ని వార్తలు