ఐర్లాండ్‌ టి20 జట్టులో భారత సంతతి ఆటగాడు 

24 Jun, 2018 02:09 IST|Sakshi

డబ్లిన్‌: భారత్‌తో జరిగే రెండు టి20 మ్యాచ్‌ల్లో పాల్గొనే 14 మంది సభ్యులతో కూడిన ఐర్లాండ్‌ జట్టును ప్రకటించారు. పంజాబ్‌లో జన్మించి ఐర్లాండ్‌లో స్థిరపడిన భారత సంతతి ఆటగాడు సిమ్రాన్‌జిత్‌ సింగ్‌ (సిమీ సింగ్‌) ఈ జట్టులో చోటు లభించింది. 31 ఏళ్ల ఆఫ్‌ స్పిన్నర్‌ సిమీ సింగ్‌ ఇప్పటికే ఐర్లాండ్‌ తరఫున ఏడు వన్డేలు, నాలుగు టి20 మ్యాచ్‌లు ఆడాడు.    

 

మరిన్ని వార్తలు