భారత్కు తొమ్మిదో స్థానం

12 Dec, 2016 14:59 IST|Sakshi

పారిస్: ప్రపంచ మహిళల టీమ్ స్క్వాష్ చాంపియన్‌షిప్‌లో భారత జట్టుకు తొమ్మిదో స్థానం లభించింది. కెనడాతో జరిగిన వర్గీకరణ మ్యాచ్‌లో భారత్ 2-0తో విజయం సాధించింది. తొలి మ్యాచ్‌లో జోష్నా చిన్నప్ప 13-11, 11-5, 7-11, 11-7తో హోలీ నాటన్‌పై గెలుపొందగా... రెండో మ్యాచ్‌లో దీపిక పళ్లికల్ 11-7, 11-5, 11-2తో సమంతా కార్నెట్‌ను ఓడించింది. ఫలితం తేలిపోవడంతో ఆకాంక్ష, డానియెలా మధ్య జరగాల్సిన మూడో మ్యాచ్‌ను నిర్వహించలేదు.

>
మరిన్ని వార్తలు