మెయిన్ ‘డ్రా’కు కృష్ణప్రియ

5 Oct, 2016 00:27 IST|Sakshi
మెయిన్ ‘డ్రా’కు కృష్ణప్రియ

సాక్షి, హైదరాబాద్: థాయ్‌లాండ్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో హైదరాబాద్ అమ్మాయి కుదరవల్లి శ్రీ కృష్ణప్రియ మహిళల సింగిల్స్ విభాగంలో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించింది. బ్యాంకాక్‌లో మంగళవారం జరిగిన క్వాలిఫయి0గ్ పోటీల్లో 18 ఏళ్ల కృష్ణప్రియ ఆడిన రెండు మ్యాచ్‌ల్లోనూ విజయం సాధించింది. తొలి రౌండ్‌లో కృష్ణప్రియ 21-13, 21-12తో తసమోన్ సంగ్‌కవతానా (థాయ్‌లాండ్)పై, రెండో రౌండ్‌లో 21-15, 21-18తో బంతిటా ఖామ్‌సరుుతోంగ్ (థాయ్‌లాండ్) పై గెలిచింది.
 
మరో తెలుగు అమ్మాయి చుక్కా సాయి ఉత్తేజిత రావు తొలి రౌండ్‌లో 13-21, 10-21తో ఒర్నిచా జాంగ్‌సతాపోర్న్‌పార్న్ (థాయ్‌లాండ్) చేతిలో ఓడిపోయి0ది. బుధవారం జరిగే మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో సుసాంతో (ఇండోనేసియా)తో కృష్ణప్రియ ఆడుతుంది. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో శ్రేయాన్‌‌ష జైస్వాల్ 17-21, 12-21తో కజుమాసా సకాయ్ (జపాన్) చేతిలో, హైదరాబాద్ ప్లేయర్ రోహిత్ యాదవ్ 16-21, 15-21తో పాంజీ అహ్మద్ మౌలానా (ఇండోనేసియా) చేతిలో ఓడిపోయారు.  
 

మరిన్ని వార్తలు